Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం... హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటీషన్

నా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం... హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటీషన్
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (12:33 IST)
నటి, వైసీపీ ఎమ్మేల్యే ఆర్కే రోజా తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం పైన హైకోర్టును ఆశ్రయించారు. తనను అసెంబ్లీలో ప్రవేశించకుండా ఏడాది పాటు స్పీకర్ కోడెల విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమనీ, దానిని ఎత్తివేయాలనీ ఆమె తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా కాల్ మనీ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో రోజా అసభ్యకరంగా మాట్లాడారన్న ఆరోపణల నేపధ్యంలో ఆమెను స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 
 
కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన రోజా... ఆ పిటీషన్లో ఇలా పేర్కొన్నారు. తనపై విధించిన నిషేధం నిబంధనలకు విరుద్ధమనీ, అసలు సస్పెన్షన్ ఉత్తర్వులు సైతం తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. స్పీకర్ తని హక్కులను కాలరాశారని పేర్కొన్న రోజా... తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.

Share this Story:

Follow Webdunia telugu