Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోటస్‌పాండ్‌లో ఘనంగా ఆంధ్రా అవతరణ వేడుకలు... జెండా ఎగురవేసిన జగన్

లోటస్‌పాండ్‌లో ఘనంగా ఆంధ్రా అవతరణ వేడుకలు... జెండా ఎగురవేసిన జగన్
, శనివారం, 1 నవంబరు 2014 (14:19 IST)
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైఎస్‌ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవంబరు ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వైకాపా నేతలు జ్యోతుల నెహ్రూ, ధర్మాన ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా జూన్ 2వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu