Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహబూబ్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకం : వైకాపా ఎంపీ మేకపాటి

మహబూబ్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకం : వైకాపా ఎంపీ మేకపాటి
, శనివారం, 18 జులై 2015 (12:30 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహబూబ్ నగర్ ఎత్తిపోతల నీటి పథకానికి వైఎస్ఆర్ సీపీ కూడా వ్యతిరేకత తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్‌లు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీనిపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో టీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకమంటూ వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేయనున్న సదరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు మేకపాటి తెలిపారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట, ఓటుకు నోటు కేసు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలను పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించేందుకు నిర్ణయించామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu