Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ నుంచి కాన్వాయ్ లేకుండా వెళ్లిపోయిన జగన్... ఎందుకంటే...?

అసెంబ్లీ నుంచి కాన్వాయ్ లేకుండా వెళ్లిపోయిన జగన్... ఎందుకంటే...?
, శుక్రవారం, 22 ఆగస్టు 2014 (17:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డికి కల్పించిన భద్రత విషయంలో సైతం తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఆయన కాన్వాయ్ కి అవసరమైన పార్కింగ్ స్థలాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లేకుండానే అసెంబ్లీ నుంచి ఇంటికి కారులో వెళ్లారు. ఇంటెలిజెన్స్ అధికారులు సైతం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu