Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవత్వంతో ఆలోచించి సహాయం చేయండి... జగన్

మానవత్వంతో ఆలోచించి సహాయం చేయండి... జగన్
, ఆదివారం, 19 అక్టోబరు 2014 (17:57 IST)
హుధుద్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన మన్యంలోని కాఫీ తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విశాఖ జిల్లాలోని పాడేరు మండలంలోని మోదపల్లి గ్రామాన్ని శనివారంనాడు సందర్శించి రైతులతో కలసి కాఫీ తోటలను పరిశీలించి వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 
 
హుధుద్ తుఫాను దెబ్బకు తాము సర్వం కోల్పోతే అధికారులు మాత్రం అంతంతమాత్రంగా సర్వే చేస్తున్నారనీ, జగన్ మోహన్ రెడ్డి వద్ద వారు మొరపెట్టుకున్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ... మానవత్వంతో ఆలోచన చేసి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu