Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారదా పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్న జగన్... ఆశా వర్కర్లు ధన్యవాదాలు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (15:33 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్టణంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. 
 
ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం తొలిసారి వైజాక్‌కు వెళ్లిన జగన్‌కి వైకాపా నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. త‌న కోసం వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చినముషిడివాడలోని శారద పీఠానికి వెళ్లారు.
 
అక్కడ సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించిన జ‌గ‌న్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అంత‌కుముందు జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్‌ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న విష‌యం తెలిసిందే.
 
ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తమ వేతనాలను పెంచి ఆదుకున్నందుకుగాను వారంతా జగన్‌కు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments