Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు... ఆ ఒక్కడిని నేనే: జగన్

చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు... ఆ ఒక్కడిని నేనే: జగన్
, శనివారం, 25 జులై 2015 (14:26 IST)
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సుఖశాంతులతో ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని జగన్ నిప్పులు చెరిగారు. రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా స్పందించే ఒకే ఒక్క వ్యక్తిని తానేనని ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది ఒక్క జగనేనన్న విషయం ప్రజలందరికీ తెలుసు’’ అని జగన్ తెలిపారు. 
 
తెలంగాణ సచివాలయాన్ని లోక్ సత్తా నేతలు, కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. లోక్ సత్తా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు నేతృత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ ముట్టడి జరిగింది. సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ, కేసీఆర్ పాలన పూర్తయి ఏడాది అవుతున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుష్కరాల మీద ఉన్న ఆసక్తి నిరుద్యోగుల మీద లేదని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu