Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యస్.. తెదేపా నాయకులు బఫూన్లు వంటివారు... జగన్ ఫైర్... అసెంబ్లీలో ఆందోళన

యస్.. తెదేపా నాయకులు బఫూన్లు వంటివారు... జగన్ ఫైర్... అసెంబ్లీలో ఆందోళన
, శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:44 IST)
మంగలి కృష్ణ ప్రస్తావనను అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు తేవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీని ఉద్దేశించి మీ లాంటి బఫూన్లు లాంటి వారు నన్ను అంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. దాంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 
 
జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయగానే స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ శాసనసభ్యులను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోరారు. 
 
బాధ్యత గల ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. అయితే జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో అసెంబ్లీని స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు తెదేపా నాయకులు జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu