Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు మరో షాక్..! మనీ లాండరింగ్ కేసులో రూ. 232 కోట్ల ఆస్తులు అటాచ్..!

జగన్‌కు మరో షాక్..! మనీ లాండరింగ్ కేసులో రూ. 232 కోట్ల ఆస్తులు అటాచ్..!
, గురువారం, 26 ఫిబ్రవరి 2015 (15:09 IST)
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మరిన్ని ఆస్తులను అటాచ్‌మెంట్ చేశారు. మొత్తం రూ.232 కోట్ల ఆస్తులను జత చేశారు. జననీ ఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్ స్థలాలు, ఆస్తులను అటాచ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ పైన అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.
 
ఈ కేసులో ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు పలుమార్లు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఫిబ్రవరి ఆరో తేదిన జగన్ కూడా ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో మూడు ఛార్జీషీట్ల పైన కోర్టుకు వచ్చారు. ఆ సమయంలో జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి తదితరులు కూడా వచ్చారు. ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu