పాకిస్థాన్లో ఉన్నామా? ముద్రగడ విషయంలో కసబ్ కంటే దారుణంగా?: అంబటి
తుని ఘటనలో అరెస్టయిన నిందితులను విడుదల చేయాలంటూ కాపు నేత ముద్రగడ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో, సాక్షి ప్రసారాలపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని నిలిపివేసింది. దీనిపై వైకాపా ఫైర్ బ్రాండ
తుని ఘటనలో అరెస్టయిన నిందితులను విడుదల చేయాలంటూ కాపు నేత ముద్రగడ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో, సాక్షి ప్రసారాలపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని నిలిపివేసింది. దీనిపై వైకాపా ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముద్రగడను పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తుంటే.. రాజమండ్రిలో ఉన్నామా? పాకిస్థాన్లో ఉన్నామా అన్నట్లు పరిస్థితి ఉందని అంబటి అన్నారు.
ముద్రగడ విషయంలో ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుది దౌర్జన్య పాలని అని అంబటి ఫైర్ అయ్యారు. సాక్షి ఛానల్ ప్రసారాల్ని నిలిపేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. తొలుత 21 రోజుల పాటు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలి. ఏ సీఎం చెప్పారనో, లోకేశ్ చెప్పారనో, హోం మంత్రి చెప్పారనో ప్రసారాల్ని నిలిపివేయకూడదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.