Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట!: చినజియర్ సూచన మేరకే..!

యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట!: చినజియర్ సూచన మేరకే..!
, గురువారం, 5 మార్చి 2015 (19:24 IST)
యాదగిరి గుట్టపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్ట అభివృద్ధి, కొత్త నిర్మాణాలపై చినజియర్‌తో చర్చలు జరిపారు. 
 
గర్భగుడిలో మార్పులు, చేర్పులపై చినజియర్‌ సూచనలను కేసీఆర్‌ పరిగణలోకి తీసుకుని యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదని స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ మొత్తంతో యాదాద్రిని బాగా అభివృద్ధి చేయవచ్చునని అంచనా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu