Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే టీసీలపై దాడులు: ఇదే వారంలో రెండోసారి.. రక్షణ ఎక్కడ?

రైల్వే టీసీలపై దాడులు: ఇదే వారంలో రెండోసారి.. రక్షణ ఎక్కడ?
, బుధవారం, 23 జులై 2014 (12:19 IST)
రైల్వే టీసీలకే రక్షణ కరువైంది. దేశంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. గత వారంలో మహిళా టీసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే మరో టీసీ దాడికి గురైంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేట దగ్గర ఎంఎంటీఎస్ రైలులో టికెట్ కలెక్టర్ (టీసీ) కౌసల్యపై దుండగులు దాడి చేశారు. టికెట్ అడిగినందుకు టీసీపై దుండగులు దాడికి పాల్పడ్డారు. 
 
టీసీ ఫిర్యాదు మేరకు బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కౌసల్యను లాలాపేట ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో మహిళా టీసీపై దాడి జరగడం రెండో సారి. కాగా, ఎంఎంటీఎస్‌లో తమకు రక్షణ కరువైందని మహిళా టీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu