Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీచర్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య: పురుగుల మందు తాగి..

టీచర్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య: పురుగుల మందు తాగి..
, గురువారం, 25 జూన్ 2015 (15:41 IST)
ఉద్యోగాలకు సిఫారసులు, డబ్బులతో కొట్టేస్తున్న తరుణంలో.. మంచిగా చదువుకున్న వారికి నిరాశే మిగులుతోంది. టీచర్ ఉద్యోగం రాలేదని ఎమ్మెస్సీ బీఈడీ వరకు చదువుకున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మోడల్ స్కూల్లో టీచరు ఉద్యోగం సంపాదించలేకపోయానన్న ఆత్మనూన్యతతో ఆ మహిళ తనువు చాలించిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. అంబవరం గ్రామానికి చెందిన మాధవి (23) ఎమ్మెస్సీ బీఈడీ వరకు చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తూ ఉండేది. గతంలో రాసిన డీఎస్సీలో రెండు మార్కుల తేడాతో ఉద్యోగం చేజార్చుకుంది. గురువారం రాచర్లలో మోడల్ స్కూల్ టీచర్ల ఎంపిక నిమిత్తం జరిగిన ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ కూడా విజయం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది.
 
దీంతో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా, మర్గమధ్యంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu