Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో వివాహితపై సామూహిక అత్యాచారం.. భర్త లేని సమయంలో..!

హైదరాబాద్‌లో వివాహితపై సామూహిక అత్యాచారం.. భర్త లేని సమయంలో..!
, మంగళవారం, 13 అక్టోబరు 2015 (14:11 IST)
భాగ్యనగరం హైదరాబాదులో వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇప్పటికే చైన్ స్నాచర్లతో మహిళలు వీధుల్లో తిరగాలంటేనే భయపడిపోతుంటే.. ఇంట్లో ఉన్న మహిళలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. అలాంటే ఘటనే నగరంలోని హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో గల కుంట్లూరులో బీహార్‌కు చెందిన దంపతులు నివసిస్తున్నారు. 
 
అయితే సోమవారం అర్థరాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో వివాహితపై ఆగంతకులు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆ వివాహిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న రేపిస్టులను పట్టుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu