Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకాశంలో స్వైన్ ఫ్లూ... వృద్ధురాలి మృతి

ప్రకాశంలో స్వైన్ ఫ్లూ... వృద్ధురాలి మృతి
, శనివారం, 31 జనవరి 2015 (17:02 IST)
స్వైన్ ఫ్లూ ప్రకాశం జిల్లాకు పాకింది.  ఒక మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. మరి కొంత మంది చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 
 
కోకిలా దేవి(72) దేవికి వారం రోజుల కింద స్వైన్ పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి కార్పోరేట్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె శనివారం ఉదయం మరణించినట్టు ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జే. యాస్మిన్ తెలిపారు. దీంతో జిల్లాలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 
 
జనవరి 26న 45 యేళ్ళ వయస్సు కలిగిన ఒక వ్యక్తి మరణించారు. తరువాత స్వైన్ ఫ్లూ పాజిటివ్ తేలిన ముగ్గురు వ్యక్తులు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. తరువాత కొత్త కేసులేమి నమోదు కాలేదని అధికారులు చెపుతున్నారు. మొత్తంపై జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడలు ఇటు జనాన్ని, అటు అధికారులను భయపెడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu