Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్ముడిలా భావించి చేరదీస్తే... సాఫీగా సాగుతున్న సంసారాన్ని నాశనం చేశాడు

వరుసకు తమ్ముడు అయిన యువకుడిని ఇంట్లోకి చేరదీస్తే.. ఓ పచ్చని సంసారాన్ని నాశనం చేయడమే కాకుండా, ఓ వివాహిత ఆత్మహత్యకు కారణంగా నిలిచాడు. కరీంనగర్ జిల్లా వేములవాడ, శాస్త్రినగర్‌లో జరిగిన ఈ విషాద ఘటన వివరాలన

తమ్ముడిలా భావించి చేరదీస్తే... సాఫీగా సాగుతున్న సంసారాన్ని నాశనం చేశాడు
, బుధవారం, 10 ఆగస్టు 2016 (11:45 IST)
వరుసకు తమ్ముడు అయిన యువకుడిని ఇంట్లోకి చేరదీస్తే.. ఓ పచ్చని సంసారాన్ని నాశనం చేయడమే కాకుండా, ఓ వివాహిత ఆత్మహత్యకు కారణంగా నిలిచాడు. కరీంనగర్ జిల్లా వేములవాడ, శాస్త్రినగర్‌లో జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
శాస్త్రినగర్‌కు చెందిన గరుడ శ్రీదేవి (24) నాగరాజు దంపతులు కొంతకాలంగా రాజన్న ఆలయం సమీపంలో చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలో ఆటో నడుపుతూ జీవించే నూగూరి శివ అనే యువకుడు వరుసకు తమ్ముడు కావడంతో కుటుంబ సభ్యులంతా చేరదీశారు. దీంతో కుటుంబ సభ్యులంతా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన శ్రీదేవిని తనతో రావాలని బెదిరించాడు. తనతో రాకపోతే భర్తను, పిల్లలను చంపేస్తానని బెదిరించి భద్రాచలం తీసుకెళ్లాడు. 
 
దీనిపై శ్రీదేవి తల్లి సువర్ణ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ఒత్తిడి మేరకు ఈ నెల 7న ఆదివారం శ్రీదేవిని తీసుకొని శివ వేములవాడకు వచ్చాడు. ఈ క్రమంలో పోలీసుల విచారణ కొనసాగుతుండగానే శ్రీదేవి మంగళవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాఫీగా సాగుతున్న తన సంసారాన్ని శివ నాశనం చేశాడని, తన చావుకు తన భర్తగాని, కుటుంబ సభ్యులు గాని కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 నోటుపై సెల్ నంబర్ రాసిచ్చి.. అవసరముంటే కాల్‌ చేయమన్న పోకిరి.. దేహశుద్ధి చేసిన మహిళ