Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దల గొడవలే ఓ వివాహిత ప్రాణాలు బలిగొన్నాయి.. చున్నీతో ఉరేసుకుని..?

పెద్దల గొడవలే ఓ వివాహిత ప్రాణాలు బలిగొన్నాయి.. చున్నీతో ఉరేసుకుని..?
, మంగళవారం, 3 మే 2016 (08:45 IST)
పంతాలు, పట్టింపులకు పోయి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఐ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన శ్రేతావర్మ (26), యూపీకి చెందిన పవన్‌కుమార్‌కు (32) మూడు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వివాహ సమయంలో ఇరు కుటుంబాలకు గొడవలుండేవి. 
 
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. సోమవారం ఉదయం యూపీలో ఉన్న పవన్‌కుమార్ బంధువులకు ఆరోగ్యం బాగా లేదని చూసేందుకు వెళ్దామని యూపీకి ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేశారు. 
 
కానీ యూపీకి వెళ్లేందుకు శ్రేతాశర్మ అంగీకరించకపోవడంతో పాటు తన చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. శ్రేతాశర్మ మృతికి పెద్దల గొడవే కారణమని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ఏజీ కార్యాలయంలో అగ్నిప్రమాదం: ఫర్నీచర్, డాక్యుమెంట్స్ దగ్ధం!