Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

Advertiesment
Crime

సెల్వి

, శుక్రవారం, 14 నవంబరు 2025 (12:34 IST)
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం కనకమహాలక్ష్మి నగర్‌లోని ఓ ఇంట్లో 30 ఏళ్ల మహిళ, ఆమె ఆరు నెలల కుమారుడు అనుమానాస్పందంగా మృతి చెంది కనిపించారు. మృతులను పోరెడ్డి వీణ (30), ఆమె కుమారుడు పోరెడ్డి వియాన్ష్‌గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఈ మరణాలు సంభవించాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
వీణ తల్లిదండ్రులు తమ బిడ్డను వరకట్న వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇంకా వీణ తల్లదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, వరకట్న వేధింపులతో ఏర్పడిన మరణానికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304-బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. శ్రావణి గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించి, తనిఖీ నిర్వహించి దర్యాప్తును సమీక్షించారు. వీణ కుటుంబం చేసిన ఆరోపణల మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె మీడియాకు ధృవీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి