Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్రమ సంబంధం వద్దని వారించిన భర్తను చంపిన భార్య!

భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో చోటుచేసుకుంది. చెడు సహవాసం మానుకోవాలని భర్త మందలించడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య అ

అక్రమ సంబంధం వద్దని వారించిన భర్తను చంపిన భార్య!
, శనివారం, 25 జూన్ 2016 (10:40 IST)
భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో చోటుచేసుకుంది. చెడు సహవాసం మానుకోవాలని భర్త మందలించడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య అతన్ని గొడ్డలితో నరికి హతమార్చింది. చంపింది. స్థానికంగా నివాసముంటున్న గోపాలకృష్ణ కూలి పనులు చేసుకుంటూ బతుకు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య రాములమ్మ అదే కాలనీకి చెందిన యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా అక్రమసంబంధం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన గోపాలకృష్ణ తీరు మార్చుకోవాలని చివాట్లు పెట్టాడు. 

దీంతో భార్య భర్తల మధ్య తరచూ కీచులాటలు జరుగుతుండేవి. దీనిపై రెండు రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవ తీవ్రం కాగా ఆగ్రహం చెందిన రాములమ్మ.. శుక్రవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అదును చూసి గొడ్డలితో నరికి హతమార్చి అక్కడి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మతో పాటు, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళ.. పట్టుకొనివచ్చి నగ్నంగా చేసి సెల్ఫీలు తీసుకున్నారు!