Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త మృతిని జీర్ణించుకోలేక... భార్య, కుమార్తె ఆత్మహత్య

భర్త మృతిని జీర్ణించుకోలేక... భార్య, కుమార్తె ఆత్మహత్య
, శనివారం, 25 అక్టోబరు 2014 (10:14 IST)
చిత్తూరు జిల్లాలో భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య, కుమార్తెతో కలిసి శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి, రాజీవ్ నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి. శ్రీనివాస్ ఇతనికి భార్య లక్ష్మీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా అక్టోబర్ 5వ తేదీన అనారోగ్యం కారణంగా శ్రీనివాస్ మృతి చెందాడు. 
 
అప్పటి నుంచి భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. భర్త లేకుండా తాము జీవించలేమంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ స్థితిలో లక్ష్మి, తొమ్మిదో తరగతి చదువుతున్నకుమార్తె ప్రసన్నతో కలిసి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేనట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu