Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొడవలితో తాగుబోతు భర్త మర్మాంగం కోసిన భార్య...

కొడవలితో తాగుబోతు భర్త మర్మాంగం కోసిన భార్య...
, మంగళవారం, 3 మార్చి 2015 (09:46 IST)
అసలే తాగుబోతు. దీనికి పైగా భార్యపై అనుమానం. ఇలాంటి తాగుబోతు భర్త వేధింపులు, అనుమానాలు భరించడం కంటే ఒకేసారి వదిలించుకోవాలని భావించింది ఓ భార్యా. అందుకే పీకలవరకు తాగివచ్చి చిత్రహింసలు పెట్టిన తాగుబోతు భర్త మర్మాంగాన్ని వంట గదిలోని కొడవలితో కోసిపారేసింది ఓ భార్య. 
 
ఈ ఘటన హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఈ స్టేషన్ ఎస్‌ఐ బి.మహేందర్ వెల్లడించిన వివరాల మేరకు... మెహిదీపట్నం అంబేద్కర్‌నగర్‌లో సత్తయ్య (35), భార్య అనసూయ (30) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సతీష్ కూలీ కాగా.. భార్య ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తోంది. సతీష్ భార్యను అనుమానించడంతో పాటు మద్యానికి బానిసై వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక భార్య అతడిని అంతమొదించాలనుకుంది.
 
ఆదివారం రాత్రి పీకలదాక తాగివచ్చి నిద్రలోకి జారుకున్న భార్తను చంపేందుకు ఇంట్లోని కొడవలితో మర్మాంగాన్ని కోయడానికి యత్నించింది. గాయపడ్డ సతీష్ కేకలు వేయడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని అదే రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి మూలుగుతున్న శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు తాళాలు పగులగొట్టి చూడగా సతీష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే 108కు పోలీసులు సమాచారం ఇచ్చి అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu