Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి అయినా బాధితులకు ఇప్పిస్తాం... సీఎం

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి అయినా బాధితులకు ఇప్పిస్తాం... సీఎం
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:19 IST)
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం నుంచి భరోసా లభించింది. అగ్రి గోల్డ్ సంస్థ ఆస్తులు ఆమ్మైనా సరే బాధితులకు ఎవరి డబ్బులు వారికి ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రాంభమవ్వకముందు అగ్రిగోల్డ్ బాధితులు ఆయనను కలిశారు. 
 
ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఏపీ సీఎంను కోరారు. వారికి ఎలాగైనా డబ్బులు ఇప్పిస్తామని సీఎం వారికి చెప్పారు. సీఎం నుంచి హామీ లభించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu