Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ చెప్పింది చేస్తాం... మంత్రి నారాయణ

పవన్ చెప్పింది చేస్తాం... మంత్రి నారాయణ
, గురువారం, 27 ఆగస్టు 2015 (08:30 IST)
రాజధాని పరిధిలో భూసేకరణ అంశంపై పవన్ కళ్యాణ్ సూచనలను పాటిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు.  ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములు సమీకరిస్తామని చెప్పారు. ఇందులో పవన్ చెప్పిన అంశాలను గుర్తు పెట్టుకుంటామని అన్నారు. 
 
బుధవారం రాత్రి జీజీహెచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శనివారం సాయంత్రానికి 99 శాతం గ్రామ కంఠాలపై అనుమానాలను పూర్తిగా తీరుస్తామని, చిన్నచిన్నవి ఏమైనా ఉంటే సోమవారం పూర్తి చేస్తామన్నారు. 
 
మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రైతులు 9.5 గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గతంలో 9.5ను నెట్‌లో పెట్టారని, ప్రస్తుతం నెట్‌లో నుంచి తొలగించామని చెప్పారు. గ్రామ కంఠాలు ప్రకటించిన తీరు అస్తవ్యస్తంగా ఉన్నందున రైతుల్లో గందరగోళం నెలకొందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu