Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ. 300 కోట్లతో మత్స్య వర్శిటీ ప్రారంభిస్తాం : ప్రత్తిపాటి హామీ

రూ. 300 కోట్లతో మత్స్య వర్శిటీ ప్రారంభిస్తాం : ప్రత్తిపాటి హామీ
, ఆదివారం, 24 మే 2015 (16:01 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 300 కోట్ల రూపాయలతో మత్స్య యూనివర్సిటీ నిర్మిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ. గుంటూరులో ఆదివారం రోజు  మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో ఉద్యాన, మత్స్య, డెయిరీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాజధాని ప్రాంత ప్రజలను కొందరు పనిగట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అటువంటి వారి మాటలను నమ్మవద్దని రైతులకు సూచించారు. 
 
దసరా నాటికి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన వివరించారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణకు తుది గడువు మే నెల 31 వరకు గడువు పొడిగించామన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన చోటే జూన్ 8న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని పత్తిపాటి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu