Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టు.. సలహాదారునిగా శ్రీధరన్!

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టు.. సలహాదారునిగా శ్రీధరన్!
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:53 IST)
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో చేపట్టనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రధాన సలహాదారునిగా మెట్రో మ్యాన్ ఇ.శ్రీధరన్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. 
 
ఇప్పటికే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడాకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో ఉడా అధికారులు టెండర్లు ఆహ్వానించారు. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని శ్రీధరన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu