Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ తుఫాను బాధితులతో దీపావళి : వెంకయ్య

విశాఖ తుఫాను బాధితులతో దీపావళి : వెంకయ్య
, బుధవారం, 22 అక్టోబరు 2014 (12:04 IST)
దీపావళి పండుగ రోజున విశాఖపట్టణం తుఫాను బాధితులతో గడుపనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. అదేసమయంలో విశాఖ తుఫాను బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. 
 
బుధవారం ఆయన విశాఖకు వచ్చారు. విశాఖలో తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ళు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. బుధ, గురువారాల్లో తాను విశాఖలోనే ఉంటానని, ఈ దీపావళిని తాను విశాఖ తుఫాను బాధితులతో కలసి జరుపుకుంటానని వెంకయ్య నాయుడు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu