Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వీఐపీ ద‌ర్శ‌నం వేళ‌ల్లో మార్పు

విజయవాడ: కృష్ణా పుష్కరాల సంద‌ర్భంగా అశేషంగా వ‌స్తున్న భ‌క్తుల సౌక‌ర్యార్ధం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శనం వేళ‌ల్లో మార్పులు చేశారు. దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళల‌ను ఉదయం 6 గంట‌ల‌ నుండి 8 గంటలు వరకు కుదించారు. తిరిగి సాయంత్రం 7 గంటలు నుండి 8.30 వరకు విఐ

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వీఐపీ ద‌ర్శ‌నం వేళ‌ల్లో మార్పు
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (16:05 IST)
విజయవాడ: కృష్ణా పుష్కరాల సంద‌ర్భంగా అశేషంగా వ‌స్తున్న భ‌క్తుల సౌక‌ర్యార్ధం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శనం వేళ‌ల్లో మార్పులు చేశారు. దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళల‌ను ఉదయం 6 గంట‌ల‌ నుండి 8 గంటలు వరకు కుదించారు. తిరిగి సాయంత్రం 7 గంటలు నుండి 8.30 వరకు విఐపీ ద‌ర్శ‌నం ఉంటుంది. 
 
విఐపి ద‌ర్శ‌నానికి 500 రూపాయ‌ల‌ టికెట్లు 13వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి. 500 రూపాయ‌ల టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు పున్నమి ఘాట్ నుండి వాహన సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేశామ‌ని దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీమ్ డైరీలో మీడియా పెద్దల జాతకం.... 69 మంది జర్నలిస్టులకు నజరానాలు