Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజలను మోసం చేయడంతో చంద్రబాబు గిన్నిస్ రికార్డు : విజయసాయి రెడ్డి

ప్రజలను మోసం చేయడంతో చంద్రబాబు గిన్నిస్ రికార్డు : విజయసాయి రెడ్డి
, సోమవారం, 25 మే 2015 (17:16 IST)
ప్రజలను మోసం చేయడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిన్నిస్ రికార్డులకెక్కుతారని వైకాపా అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సర్కారు వైఫల్యాలను తమ పార్టీ ఎండగడుతుందన్నారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన బాబు... అధికారం చేపట్టాక చేసిన తొలి ఐదు సంతకాలను అమలు చేయకుండా అభాసుపాలు చేశారన్నారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్న విజయసాయి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో బాబు గిన్నిస్ రికార్డుకెక్కుతారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో వైసీపీ సమరదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu