Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు పనితీరు ప్రధానిని ఆకట్టుకుంది: వెంకయ్య నాయుడు

చంద్రబాబు పనితీరు ప్రధానిని ఆకట్టుకుంది: వెంకయ్య నాయుడు
, బుధవారం, 22 అక్టోబరు 2014 (19:59 IST)
హుదూద్ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన విశాఖ వాసులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించే క్రమంలో చంద్రబాబు రేయింబవళ్లు పనిచేసిన వైనం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆకట్టుకుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చంద్రబాబు నిజమైన ప్రజా సేవకుడని ప్రధాని మోడీ కీర్తించారని వెంకయ్య తెలిపారు. 
 
విశాఖ ఆర్కే బీచ్‌లో జరుగుతున్న ఆత్మవిశ్వాస ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల గుండె నిబ్బరాన్ని పొగిడారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ప్రాంతానికి పునర్వైభవం తీసుకొచ్చేదాకా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
 
విశాఖ వాసులు, హుదూద్ తుఫానుకు ఎదురొడ్డి నిలిచిన వైనం అమోఘమని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల కృషి ఫలితంగా విశాఖకు పూర్వ వైభవం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu