Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చట్టసభల్లోకి బజారు సరుకు వస్తోంది : వెంకయ్య నాయుడు

చట్టసభల్లోకి బజారు సరుకు వస్తోంది : వెంకయ్య నాయుడు
, శనివారం, 9 జనవరి 2016 (13:19 IST)
చట్టసభల్లోకి బజారు సరుకు వస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-19 జాతీయ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరు ఆందోళనకరం, సిగ్గు చేటన్నారు. 
 
చట్ట సభల్లోకి బజారు సరుకు వస్తోందని, అందువల్లే చట్టసభల్లో సభ్యులు అసభ్యకర పదజాలం వాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు బజారు సరుకును అసెంబ్లీ, పార్లమెంటుకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు. వారంతా చట్టసభల్లో రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాజకీయ నాయకులు సహృదయంతో మెలగాలని వెంకయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీలు కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, వైకాపాకు చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu