Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : వెంకయ్య నాయుడు

ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : వెంకయ్య నాయుడు
, ఆదివారం, 30 ఆగస్టు 2015 (16:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్రం వెనక్కితగ్గబోదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదన్నారు.
 
ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బిల్లుల ఆమోదం కోసం సెప్లెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. 
 
అయితే, దేశ వ్యాప్తంగా మరో 9 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం, పరిశ్రమలకు రాయితీలపై నీతిఆయోగ్‌ అధికారులతో 75 నిమిషాలు చర్చలు జరిపామన్నారు. రాష్ట్రానికి ఏవిధంగా సాయం చేయాలనే దానిపై నీతిఆయోగ్‌ అధికారులు నివేదికను రూపొందించి ప్రధానికి అందజేస్తారని వెంకయ్య పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu