Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖలో దొంగల ముఠా అరెస్టు.. భారీ ఎత్తున నగదు స్వాధీనం

విశాఖలో దొంగల ముఠా అరెస్టు.. భారీ ఎత్తున నగదు స్వాధీనం
, శనివారం, 28 మార్చి 2015 (11:06 IST)
విశాఖ పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు ఎట్టకేలకు చిక్కారు. వారిని శుక్రవారం చాచక్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి దొంగతనాల చిట్టాలను విప్పుతున్నట్లు సమాచారం వివరాలిలా ఉన్నాయి.
 
విశాఖపట్నం నగరంలో చోరీలకు పాల్పడుతూ కాలనీ వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ దొంగల ముఠా పోలీసులు కన్నేవారు. ఇద్దరు దొంగలను నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి రూ. 5.65 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. 
 
పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పట్టుబడిన దొంగలు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారు ఇంకా ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డారో తెలుసుకునే పనిలో పడ్డారు. 
 

Share this Story:

Follow Webdunia telugu