Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాధేయపడిన విడచలేదు.. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన మృగాడు

ప్రాధేయపడిన విడచలేదు.. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన మృగాడు
, సోమవారం, 22 డిశెంబరు 2014 (15:06 IST)
అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గు బిడ్డలున్నారు.. అయినా ముక్కు పచ్చలారని పిల్లలపై కన్నేశాడు. వస్తూ పోతూ మచ్చిక చేసుకుని రేసు కుక్కలా విరుచుకు పడ్డాడు. ప్రాధేయపడినా విడచలేదు. తాను చేసిన లైంగిక దాడిలో మర్మాంగాల వద్ద రక్త గాయాలతో ఇళ్లు చేసిన ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. తూ.గో. జిల్లాలో జరిగిన సంఘటన అందరిని కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన 35 ఏళ్ల బడి కృపారావు సముద్రంపై చేపల వేటతో సాగిస్తుంటాడు. అతడికి తొలుత వివాహమైంది. భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలున్నారు. అతడు తరచూ కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలోని అతడి తోడల్లుడు ఉమ్మిడి అమ్మోరి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. అక్కడున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. శనివారం రాత్రి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను మభ్యపెట్టి తన వెంట సరుగుడు తోటల్లోకి తీసుకెళ్లాడు. అతని దురుద్దేశ్యాన్ని తెలుసుకోలేకపోయిన పిల్లలు అతని వెంట వెళ్ళారు. అక్కడ వారిద్దరిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఇష్టానుసారం వ్యవహరించాడు. ఏడేళ్ళ బాలిక కాళ్ళవేళ్ళ పడినా పట్టించుకోలేదు. రేసు కుక్కలా గాయపరిచాడు. ఇంటికి చేరిన తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. ఐదేళ్ల చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పిల్లలను పరిశీలించిన వైద్యలు కామాంధుడు విరుచుకు పడిన విధానాన్ని చూసి డాక్టర్లు విస్తుబోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కృపారావు పరారీలో ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu