Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోజో టీవీకి టీవీ9 ఛానల్ లోగోను అమ్మేశారు.. రవిప్రకాశ్‌పై కేసు

మోజో టీవీకి టీవీ9 ఛానల్ లోగోను అమ్మేశారు.. రవిప్రకాశ్‌పై కేసు
, శుక్రవారం, 17 మే 2019 (12:35 IST)
టీవీ9 ఛానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత ఛానల్ మోజో టీవీకి అమ్మోశారంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.99 వేలకు విక్రయించారని ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదంతా మౌఖిక ఒప్పందం ప్రకారమే జరిగిందని తెలిపారు. ఈ మేరకు గతేడాది 31న డీడ్ ద్వారా వాటిని రాసి ఇచ్చేసినట్టు వివరించారు. 
 
టీవీ9 లోగోలు అమ్మినందుకు ప్రతిగా రావాల్సిన రూ.99 వేలను నెక్ట్స్‌ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారు, కానీ ఆ మొత్తాన్ని ''అదర్‌ రిపెయిర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌''గా పేర్కొన్నారని కౌశిక్ రావు తన ఫిర్యాదులో తెలిపారు.

కోట్ల రూపాయల విలువచేసే లోగోలను రవిప్రకాశ్ అక్రమంగా కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించేలా విక్రయించారని కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌కు ఉచ్చు బిగుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో ఘోరం.. కలుషిత సిరంజీతో 400 మందికి ఎయిడ్స్ ఎక్కించాడు..