Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ
, శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (11:26 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ అంకురార్పణతో వెంకన్న బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించినట్లైంది. తద్వారా బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లైంది. 
 
అలాగే శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతం పెద్ద శేషవాహనం మీద నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. 
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజున జరిగే గరుడోత్సవానికి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు రానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu