Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాత్కాలిక రాజధానిగా మేధా టవర్స్... నేడు అక్కడే కేబినెట్ సమావేశం

తాత్కాలిక రాజధానిగా మేధా టవర్స్... నేడు అక్కడే కేబినెట్ సమావేశం
, శుక్రవారం, 31 జులై 2015 (07:24 IST)
రాష్ట్రం ఒక్కచోట.. రాజధాని మరోచోట. పాలన కష్టసాధ్యమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక రాజధానిని నిర్ణయించారు. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఉన్న ‘మేధా టవర్స్’లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించారు. శుక్రవారం జరుగనున్న కేబినెట్ సమావేశం ఇక్కడే జరపనున్నారు. 
 
మేధా టవర్స్‌లోనే శాఖాధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక చంద్రబాబు విజయవాడ నివాసం కోసం గతంలో ఎంపిక చేసిన లింగమనేని టవర్స్‌ను మంత్రులు, ఉన్నతాధికారుల తాత్కాలిక బసకు వినియోగించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలపై నేటి కేబినెట్ భేటీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu