హైదరాబాద్లోని ఎల్బినగర్లో ఉన్న జిల్లాకోర్టులో ఆంధ్రా జడ్జిపై తెలంగాణ న్యాయవాదులు దాడి జరిపారు.
ఈ దాడి పలు ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక కోర్టులు కావాలంటూ తెలంగాణ న్యాయవాదులు కోర్టు ముందు ఆందోళనకు దిగారు.
ఆంధ్రా జడ్జిలు వెళ్లిపోవాలంటూ కోర్టు గేటుకు తాళం వేసి రోడ్డుపై భైఠాయించి ధర్నాకు దిగారు. అదే సమయంలో కోర్టుకు హాజరవుతున్న జడ్జిపై కోడిగుడ్లతో దాడి చేసారు. దాంతో జడ్జి వెనక్కి వెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాయర్లను అరెస్ట్ చేశారు.