Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా... మహిళా ఎమ్మెల్యే అనే జ్ఞానం కూడా లేదా... వైసీపీ

ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా... మహిళా ఎమ్మెల్యే అనే జ్ఞానం కూడా లేదా... వైసీపీ
, శుక్రవారం, 3 జులై 2015 (20:50 IST)
అక్రమాలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలనైనా అరెస్టు చేసి విజయాన్ని సాధించుకునే నీచ స్థితిలోకి తెలుగుదేశం ప్రభుత్వం ఉందని డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మహిళా ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఉన్న భూమా నాగిరెడ్డిని నువ్వు అరిస్తే ఏమీ కాదు అంటూ డీఎస్పీ ఏకవచనంతో మాట్లాడారని, ఎమ్మెల్యేలతో మాట్లాడేతీరు ఇదేనా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డితో అగౌరవంగా మాట్లాడిన విషయం వీడియో రికార్డులో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. భూమా కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 
 
మహిళా ఎమ్మెల్యేతో ఇలా ప్రవర్తించడం సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ విషయంపై పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకే భూమా నాగిరెడ్డిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని రాజేంద్రనాథ్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu