Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం... మ‌ళ్ళీ ఆక‌ర్ష్ మొద‌లెట్టిన టీడీపీ... గిద్దలూరు ఎమ్మెల్యే జంప్...

విజ‌య‌వాడ‌: ఇప్ప‌టికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ ఆక‌ర్షించింది. ఇపుడు రెండో విడ‌త‌... రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం మరో 20 మంది ఎమ్మెల్యేల‌ను లాక్కునే ప‌ని అపుడే స్టార్ట్ అయిపోయింది. మ‌లి విడ‌త తొలి బోణీగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్య

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం... మ‌ళ్ళీ ఆక‌ర్ష్ మొద‌లెట్టిన టీడీపీ... గిద్దలూరు ఎమ్మెల్యే జంప్...
, సోమవారం, 30 మే 2016 (15:35 IST)
విజ‌య‌వాడ‌: ఇప్ప‌టికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ ఆక‌ర్షించింది. ఇపుడు రెండో విడ‌త‌... రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం మరో 20 మంది ఎమ్మెల్యేల‌ను లాక్కునే ప‌ని అపుడే స్టార్ట్ అయిపోయింది. మ‌లి విడ‌త తొలి బోణీగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి రెడీ అయిపోయారు. ఆయ‌న జూన్ 1న టీడీపీలో చేర‌నున్నారు. 
 
విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో చేరికకు రంగం అంతా సిద్ధం అయిపోయింది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా అధిక సంఖ్యలో పాల్గోనేందుకు వాహనాలను సమకురుస్తున్నారు. మ‌లి విడ‌త చేరిక‌ల‌కు అంకురార్పణ ఇది. ఇక రాజ్య‌స‌భ ఎన్నిక‌ల లోగా ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వ‌స్తూనే ఉంటార‌ని టీడీపీ నేత ఒక‌రు వ్యాఖ్య‌నించారు. మరి ఎంతమంది వస్తారన్నది మాత్రం ఆయన చెప్పలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదలు : 12 మంది మృతులు