Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన తలసాని

రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన తలసాని
, ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:25 IST)
టీ టీడీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన నేతలు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్నటికి మొన్న టీ టీడీపీ కార్యకర్తలు చావు డప్పు మోగించిన సంగతి తెలిసిందే.

దీనిపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధీటుగా స్పందించారు. టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
సనత్ నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని తలసాని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఓడితే, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ ఆయన ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. నోటి మాటతో కాకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందాం రమ్మంటూ తలసాని ఛాలెంజ్ చేశారు. మరి దీనికి ఎర్రబెల్లి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu