సీఎం సొంత నియోజకవర్గంలో సైకో వీరంగం - మహిళపై సూదితో దాడి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. ఒక వివాహితపై సూదితో దాడికి దిగి గాయపరిచాడు. ఈ సైకో వీరంగంతో చిత్తూరు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. ఒక వివాహితపై సూదితో దాడికి దిగి గాయపరిచాడు. ఈ సైకో వీరంగంతో చిత్తూరు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.
కుప్పం పట్టణం ఎన్టిఆర్ కాలనీలో కాపురమున్న నజీర్ భార్య ఫర్జానా ఇంట్లో ఉండగా గుర్తు తెలియని యువకుడు ఇంటర్నేషన్ పాఠశాల నుంచి వచ్చినట్లు తెలిపాడు. పిల్లలను తమ పాఠశాలలో చేర్పిస్తే ఉచిత వసతులు, ఉపకారం వేతనం ఇస్తామన్నాడు. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించినట్లు ఫర్జానా తెలిపింది.
రక్తపరీక్ష చేయించుకుని ధృవీకరణ పత్రం ఇస్తే కనీసం ఉపకార వేతనం వచ్చేటట్లు చూస్తానని నమ్మబలికాడు. ధృవీకరణ పత్రం తీసుకొచ్చే సమయంలో హఠాత్తుగా సూది మందుతో దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. సూదితో చేతిపై గుచ్చిన వెంటనే ప్రతిఘటించి యువకుడిని పక్కకు తోసేసి కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడని మహిళ తెలిపింది.
నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే అనుమానంగా తిరుగుతున్న కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైకో సూది దాడితో చిత్తూరు జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.