Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోదాపై ఏకాభిప్రాయం అవసరం లేదు.. వెంకయ్య అలా మాట్లాడి వుంటారని..!

హోదాపై ఏకాభిప్రాయం అవసరం లేదు.. వెంకయ్య అలా మాట్లాడి వుంటారని..!
, మంగళవారం, 1 డిశెంబరు 2015 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏకాభిప్రాయం అవసరం లేదని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. ఇక జీఎస్టీ బిల్లుకు పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఏకాభిప్రాయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడి ఉంటారని తాను అనుకోవట్లేదని సుజనా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయం కావాలనడం సరికాదని సుజనా చెప్పారు.
 
పార్లమెంటులో చర్చించాకే విభజన బిల్లు ఆమోదం పొందిందని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఏది ఇస్తారో స్పష్టత లేదని, కానీ రాష్ట్రానికి కేంద్రం నష్టం జరగకుండా చూస్తుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu