విద్యార్థిని రిషితేశ్వరీ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడే కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు. ర్యాగింగ్ కారణంగా రిషతేశ్వరీ ఆత్మహత్యకు కారకులైన వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దోషులను వదిలిపెట్ట కూడదని వారు డిమాండ్ చేశారు. ఏఎన్యూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చుట్టూ ఉన్న పిల్లలే ఈ ర్యాగింగుకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్దండే, ఐజీ సంజయ్, ఇతర అధికారులు హాజరయ్యారు.