Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:44 IST)
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. శనివారం తెల్లవారు జామున జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దిలీప్ వర్మ అనే యువకుడు మరణించాడు. భీమవరం నుంచి చదువు కోసం వెళ్లిన ఈ యువకుడి వయసు 29 ఏళ్లు. ఒక మిత్రుడితో కలిసి కారులో వెళుతుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగి వర్మ మృతి చెందాడు. ఇతనితో పాటు ఉన్న వ్యక్తి గాయపడగా ఆస్పత్రిలో చేర్చారు.
 
ఇటీవలి కాలంలో విదేశాల్లో ప్రాణాలు కోల్పోయే తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న విషయం తెల్సిందే. ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి.. అక్కడ రోడ్డు ప్రమాదాల్లో వీరు దుర్మరణం చెందడం ఎంతో విషాదాన్ని కలిగిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu