Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల ప్యాకేజీ.. పీఎంవోకు చేరిన ముసాయిదా

ఆంధ్రప్రదేశ్ కోసం లక్షా 50 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ముసాయిదా ప్రతిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసినట్టు ఢిల్లీ నుంచి వార్తలు వస్త

ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల ప్యాకేజీ.. పీఎంవోకు చేరిన ముసాయిదా
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (21:19 IST)
ఆంధ్రప్రదేశ్ కోసం లక్షా 50 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ముసాయిదా ప్రతిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసినట్టు ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ముసాయిదా ప్రతిని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)కు పంపింది. పీఎంఓ నుంచి స్పష్టత వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. 
 
కాగా, ఈ ముసాయిదాలో పారిశ్రామిక రాయితీలు మినహా మిగతా అంశాలు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. విశాఖ - చెన్నై కారిడార్ నిధుల ఖర్చు కేంద్ర వాణిజ్య శాఖ భరించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణం, నౌకాశ్రయాల ఖర్చుపై కీలక ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు. ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆరేళ్ల పాటు రూ.350 కోట్ల నిధుల చొప్పున ప్రకటించే అవకాశముందని సమాచారం. 
 
రాజధాని నిర్మాణానికి రూ.10 నుంచి రూ.15 వేల కోట్లు
జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.25 వేల కోట్లు 
పోర్టుల అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లు
కమర్షియల్‌ కారిడార్‌ కోసం రూ.12 వేల కోట్లు
యూనివర్శిటీల కోసం రూ.10 నుంచి రూ.12 వేల కోట్లు  
పోలవరం కోసం రూ.28 కోట్లు 
లోటుభర్తీకి రూ.10 వేల కోట్లు 
వెనుకబడిన జిల్లాలకు రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఎఫెక్ట్.. స్మార్ట్ ఫోనులో నాలుగైదు సిమ్‌లుంటే ఎంత బావుండో..