Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయలసీమపై దృష్టి పెట్టాలి.. ఏపీ సీఎం చంద్రబాబు

Advertiesment
Chandra babu
సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఒక ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 
 
సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, సౌర విద్యుత్ ప్రాజెక్టులలోకి, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సిన ఆవశ్యకతను బాబు చెప్పారు. 
 
భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా, పటిష్టమైన విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 
పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాలతో సహా పలు రంగాల్లో మొత్తం రూ. 39,436.84 కోట్ల పెట్టుబడితో 31 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,11,278 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. 
 
రాయలసీమలో సోలార్ పార్కులను అభివృద్ధి చేసి, తదనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర, జాతీయ గ్రిడ్‌లతో అనుసంధానం చేసేందుకు ట్రాన్స్‌మిషన్ లైన్లను బలోపేతం చేసి, అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరాను సాధ్యం చేయాలని ఆయన అన్నారు. 
 
శ్రీ సిటీ, కొప్పర్తి, అనంతపురం వంటి ప్రాంతాలపై దృష్టి సారించి, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీకి రాష్ట్రాన్ని ఒక కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను (జీసీసీలు) ఏర్పాటు చేయడం, ఐటీ పర్యావరణ వ్యస్థను బలోపేతం చేయడంపై ఆయన ఉద్ఘాటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ ధర్మసత్రం కాదు... చొరబాటుదార్లకు చోటు లేదు : అమిత్ షా