Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలుకు ఎదురెళ్లి... హైదరాబాద్‌‌లో టెక్కీ ఆత్మహత్య..!

రైలుకు ఎదురెళ్లి... హైదరాబాద్‌‌లో టెక్కీ ఆత్మహత్య..!
, బుధవారం, 4 మార్చి 2015 (12:54 IST)
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వందలాది మంది చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని చందానగర్, లింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. 
 
సహోద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకటరెడ్డి (30). అతను గచ్చిబౌలి లోని డీఎస్ టీ వరల్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వెంకటరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరు మణికొండలో నివాసం ఉంటున్నారు. వెంకటరెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో సరదాగా ఉండేవాడని తోటి ఉద్యోగుల సమాచారం. అయితే వెంకటరెడ్డి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే విషయం తెలియలేదని అన్నారు.
 
అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వెంకటరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu