Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగుళూరు వెళ్లిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్?

బెంగుళూరు వెళ్లిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్?
, శనివారం, 1 నవంబరు 2014 (13:50 IST)
బెంగళూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ మహిళా స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైంది. అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 
 
అక్టోబర్ 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లారు. తర్వాత భరణికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాప్ చేయబడి ఉంది. తర్వాత రోజు ఆయన భరణి పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా ఆమె రాలేదని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. 
 
దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు, మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu