Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదా వద్దనేది... బీజేపీలోని సిల్లీ, గల్లీ నాయకులే..! పోరాటం ఆగదు.. శివాజీ

ప్రత్యేక హోదా వద్దనేది... బీజేపీలోని సిల్లీ, గల్లీ నాయకులే..! పోరాటం ఆగదు.. శివాజీ
, శనివారం, 1 ఆగస్టు 2015 (13:40 IST)
రాష్ట్రం.. రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతాపార్టీలో నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఆ పార్టీలో కొందరు సిల్లీ, గల్లీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాపై భారతీయ జనతాపార్టీ అధిష్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అయితే ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. శనివారం ఉదయం ఆయన ప్రత్యేక హోదాపై సీపీఐ ఏర్పాటు చేసిన బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
భారతీయ జనతాపార్టీ ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి? ప్రస్తుతం చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. మోడీ దేశానికి ఏదో చేస్తారనుకుంటే అంత సీన్ లేదనిపిస్తున్నాని చెప్పారు. ఒకప్పుడు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగాళాఖాతంలో కలిపేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. 
 
భారతీయ జనతాపార్టీలోని నాయకులు కేవలం తమ వ్యక్తిగత స్వార్థం కోసం నాయకులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తాము పోరాటం సాగిస్తామని చెప్పారు. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu