Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా మార్కెట్ ఎఫెక్ట్ : బ్లాక్ మండే మార్కెట్.. రూ.లక్షన్నర కోట్ల ఆవిరి

చైనా మార్కెట్ ఎఫెక్ట్ : బ్లాక్ మండే మార్కెట్.. రూ.లక్షన్నర కోట్ల ఆవిరి
, సోమవారం, 4 జనవరి 2016 (15:06 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సోమవారం బ్లాక్ మండేగా నమోదైంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ కేంద్రంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, చైనా మాంద్యం, ఇండియాలో పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడి కారణాలు ఏదైతేనేం, ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం నాటి భారత స్టాక్ మార్కెట్ నష్టపోయింది. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల భారత ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. 
 
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ, ఆపై మరింత నష్టాల్లోకి, మధ్యాహ్నం తర్వాత పాతాళానికి జారిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే, 503 పాయింట్లు నష్టపోయి 25,657 పాయింట్ల వద్ద, నిఫ్టీ 163 పాయింట్ల పతనంతో 7,799 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో కేవలం 4 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. గతవారం చివర్లో మార్కెట్లో మార్కెట్ కాప్‌తో పోలిస్తే ఇప్పటికే దాదాపు రూ.లక్షన్నర కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. 

Share this Story:

Follow Webdunia telugu